Amaravati Cable bridge: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. మూడేళ్లలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేసి.. ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. అమరావతిలో కేబుల్ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 320 మీటర్ల పొడవుతో కేబుల్ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.