తెలుగు తల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రహదారి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 2005లో అప్పటి పురపాలక శాఖ మంత్రి కొనేరూ రంగారావు ప్రారంభించి, “తెలుగు తల్లి ఫ్లైఓవర్”గా నామకరణం చేశారు. ఈ వంతెన అశోక్నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను సికింద్రాబాద్తో అనుసంధానించడంలో కీలకంగా మారింది. లిబర్టీ నుంచి సచివాలయానికి వెళ్ళే వాహనదారుల రద్దీ తగ్గింది. తెలంగాణ ఏర్పాటుతో తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చేందుకు నిర్ణయించింది.