హైదరాబాద్‌లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..

11 months ago 23
తెలుగు తల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రహదారి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 2005లో అప్పటి పురపాలక శాఖ మంత్రి కొనేరూ రంగారావు ప్రారంభించి, “తెలుగు తల్లి ఫ్లైఓవర్”గా నామకరణం చేశారు. ఈ వంతెన అశోక్‌నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను సికింద్రాబాద్‌తో అనుసంధానించడంలో కీలకంగా మారింది. లిబర్టీ నుంచి సచివాలయానికి వెళ్ళే వాహనదారుల రద్దీ తగ్గింది. తెలంగాణ ఏర్పాటుతో తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చేందుకు నిర్ణయించింది.
Read Entire Article