హైదరాబాద్లో కరెంటు తీగలను భూగర్భంలోకి మార్చడానికి డిస్కం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రమాదాలు, అంతరాయాలు తగ్గించడమే లక్ష్యం. మెట్రో జోన్లో మొదటగా ఈ పనులు చేపడతారు. మొత్తం ప్రాజెక్టుకు రూ. 14,725 కోట్లు అవసరమని అంచనా. నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించారు. ఇరుకు ప్రాంతాల్లో ఏబీ కేబుల్స్ కూడా వేయనున్నారు.