హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్. నగరంలో ఇప్పటికే నెహ్రూ జూ పార్కు అందుబాటులో ఉండగా.. రెండో జూ పార్కు కూడా అందుబాటులోకి రానుంది. నగర శివారు ముచ్చర్లలో అత్యాధునిక నైట్ సఫారీ పార్కు ఏర్పాటు కానుంది. 203.83 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఈ పార్కులో రాత్రిపూట జంతువులను చూడవచ్చు. వర్చువల్ రియాలిటీ అనుభవాలను పొందవచ్చు. డైనోసార్ పార్క్, అడ్వెంచర్ పార్క్ వంటి ప్రత్యేక ఆకర్షణలు యువతను, పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.