Kakinada 19 Years Old Boy Murdered: కాకినాడ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన యువకుడు కిరణ్ కార్తీక్ హత్యకు గురయ్యాడు. సొంత చెల్లితో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేని సోదరుడు, స్నేహితుడితో కలిసి కార్తీక్ను దారుణంగా హతమార్చాడు. పార్టీ పేరుతో తీసుకెళ్లి గొంతు నులిమి చంపి, మట్టిదిబ్బలో పూడ్చేశారు. ఈ కేసులో నిందితులు పోలీసులకు లొంగిపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.