హైదరాబాద్ శివారు గాజుల రామారంలో హైడ్రా వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించింది. దాదాపు రూ.4,500 కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ భూములను ప్రభుత్వ సంస్థలకు కేటాయించగా.. వాటిని కొందరు ఆక్రమించారు.