లాభాల ఆశతో గంజాయి సాగు చేస్తున్న రైతులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక రైతు పత్తి చేనులో రహస్యంగా పెంచుతున్న 108 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలోనూ వెలుగు చూసింది. ఇక రాష్ట్రంలో గంజాయి సాగు, వాడకం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. కఠిన చర్యలు తప్పవన్నారు.