మత్తు పదార్థాల మహమ్మారిని రూపుమాపి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలంతా ఏకం కావాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారు ప్రత్యేక సందేశాలు జారీ చేశారు. డ్రగ్స్ అలవాటు వ్యక్తుల జీవితాలనే కాకుండా కుటుంబాలను నాశనం చేస్తూ.. తీవ్ర శాంతి, భద్రతల సమస్యలకు కారణం అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.