తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును.. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం ఇటీవల రిలీవ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1992 బ్యాచ్ తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు.. ఉమ్మడి ఏపీలో మీ సేవ సహా పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చి పాలనలో పారదర్శకత తెచ్చారు.