Son Meet Parnets After 12 Years: 12 ఏళ్లుగా అదృశ్యమైన కుమారుడి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు కర్నూలు పోలీసులు అండగా నిలిచారు. పోలీసులు చొరవతో, టెక్నాలజీ సహాయంతో సురేష్ ఆచూకీ కనుగొని, అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటర్ తర్వాత వ్యాపారం చేస్తానని చెప్పి వెళ్లిపోయిన సురేష్ను.. కరోనా సమయంలో మీడియాలో కనిపించిన వీడియో ద్వారా గుర్తించారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో ఆచూకీ దొరికింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.