Jonnagiri Gold Sales In Market: మేడిన్ ఆంధ్ర బంగారం మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ముందుగా కర్నూలుకు చెందిన వ్యాపారులు ఈ బంగారాన్ని కొనుగోలు చేశారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ముందుగా 100 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేశారు.. త్వరలోనే పూర్తిస్థాయిలో బంగారం మార్కెట్లో వినియోదారులకు అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు కర్నూలు బంగారం వ్యాపారులు.