Acid Beetles Panic In East Godavari: ఏపీలో యాసిడ్ పురుగులు (పెడిరోవ్ బీటిల్స్) శ్రామికుల్ని భయపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో పనిచేసేవారు మొక్కల రవాణా సమయంలో పురుగులు శరీరంపై పాకుతున్నాయి. కొందరు వాటిని చేతితో నలిపేస్తే, వాటి నుంచి విడుదలయ్యే 'పెడిరిన్' కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద, మంట, అలర్జీ వస్తోంది. ఈ పురుగులు కుట్టకపోయినా నలిపినా ఇబ్బందులు తప్పవని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పురుగులు కంట్లో పడకూడదని హెచ్చరిస్తున్నారు.