ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉండటంతో.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా..