14 ఏళ్ల నాటి మహిళ హత్య కేసు.. మరణశిక్ష విధించిన కోర్టు..

2 months ago 8
హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో 2011లో జరిగిన మహిళా హత్య కేసులో 14 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా మహిళను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన నిందితుడు కరణ్ సింగ్‌కు మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సనత్‌నగర్ పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. న్యాయమూర్తి వెంకటేశ్వరరావు దోషికి ఉరిశిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో బాధితురాలి కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం చేకూరింది. నిందితుల్లో వణుకు పుట్టించేలా ఈ తీర్పు ఉందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.
Read Entire Article