14 ఏళ్ల నాటి మహిళ హత్య కేసు.. మరణశిక్ష విధించిన కోర్టు..

7 months ago 24
హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో 2011లో జరిగిన మహిళా హత్య కేసులో 14 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా మహిళను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన నిందితుడు కరణ్ సింగ్‌కు మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సనత్‌నగర్ పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. న్యాయమూర్తి వెంకటేశ్వరరావు దోషికి ఉరిశిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో బాధితురాలి కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం చేకూరింది. నిందితుల్లో వణుకు పుట్టించేలా ఈ తీర్పు ఉందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.
Read Entire Article