పౌరసత్వం విషయంలో అసదుద్దీ్న్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పౌరసత్వాన్ని నిర్ణయించేది చట్టం, రాజ్యాంగం అని తేల్చి చెప్పారు. పౌరసత్వంపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బారిస్టర్ అయి ఉండి.. ఆయన చట్ట విరుద్దంగా మాట్లాడటం విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు కానివారికి కూడా పాస్పోర్ట్ జారీ చేయవచ్చని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.