ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇటీవలే చంద్రబాబు యూఏఈలో పర్యటించారు. మూడు రోజులపాటు యూఈఏలో పర్యటించిన చంద్రబాబు.. రాష్ట్రానికి రాగానే మొంథా తుపాను వ్యవహారంలో బిజీ అయ్యారు. ఇప్పుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. నవంబర్ 2వ తేదీన చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. యూఏఈ పర్యటన ముగిసిన 15 రోజుల వ్యవధిలోనే మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. నవంబర్ నెలలో విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలు చేపడుతున్నారు.