17 ఏళ్ల క్రితం బలిమెల ఘటనలో అమరులైన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స్థలాల పట్టాలు అందించారు. నాటి హోంమంత్రి జానారెడ్డి ఇచ్చిన హామీని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారు. డీజీపీ శివధర్ రెడ్డి చొరవతో గాజులరామారాంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని.. బలిమెల ఘటనలో అమరులై 33 కుటుంబాలకు.. 200 గజాల స్థలాల చొప్పున కేటాయించారు. ఇతర జిల్లాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.