ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక్క సలహా కోసం రూ.11 కోట్లు డిమాండ్ చేసిన ఘటన చర్చనీయాంశమైంది. హైదరాబాద్కు చెందిన ఓ ఇంజనీరింగ్ కంపెనీ కొత్త ప్రొడక్ట్ మార్కెటింగ్ కోసం ఆయన సలహా కోరగా.. కేవలం రెండు గంటల కన్సల్టేషన్ కోసం ఈ భారీ మొత్తం అడిగినట్లు సమాచారం. 2019లో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా పనిచేసి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం రాజకీయాలతో పాటు వ్యాపార, సలహా రంగాల్లోనూ కొనసాగుతున్నారు. అయితే ఈ ఫీజు వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.