Dugarajapatnam Port Construction: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుగరాజుపట్నంలో నిర్మించబోతున్న కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టు, నౌకా నిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన 2 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు మారిటైం బోర్డుకు అనుమతులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో తీర ప్రాంతాల రూపురేఖలు మారడమే కాకుండా, వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ మెరైన్ సెజ్ ఏర్పాటు కానుంది. 5 వేలకు పైగా ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు.