తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మహిళలతో పూర్తిగా నిర్వహించబడే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో ఐదు నియోజకవర్గాల్లో ఈ బంకులు ప్రారంభం కానున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ పాసైన వారికి పెట్రోల్, డీజిల్ నింపడం, క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తుండగా.. డిగ్రీ పూర్తి చేసిన మహిళలను మేనేజర్ పోస్టుల్లో నియమించనున్నారు. ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచనుంది.