మరి కొద్ది రోజుల్లో తెలంగాణ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. దీనికి ముందే నకిలీ ఓట్లను తొలగింపు మొదలయ్యింది. ఈసీ తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ సాయంతో ఇప్పటి వరకు 5 లక్షల ఓట్ల నకిలీవి గుర్తించి తొలగించారని తెలుస్తోంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదుచేసుకున్న వారిని గుర్తించేందుకు డెమొగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్ అనే సాంకేతికతను ఈసీ రూపొందించింది. ఇక, తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 25 వరకు ఎస్ఐఆర్ జరగనుంది.