టీడీపీ కార్యవర్గం ప్రమాణస్వీకారంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ దండం పెట్టారు. టీడీపీ శ్రేణులు అంతా 2029 ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మన పార్టీ నేతే ముఖ్యమంత్రిగా ఉంటారు అని పల్లా శ్రీనివాస్ అనడంతో అక్కడే ఉన్న నారా లోకేష్ స్పందించారు. ఇక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణం చేశారు.