సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన ఉండి.. రాసే నైపుణ్యం ఉన్నవారికి జనసేన పార్టీ కంటెంట్ రైటర్లుగా అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని.. తమ దరఖాస్తులను మెయిల్ చేయాలని కోరింది. అలాగే తాజా రాజకీయాలు, సామాజిక సమస్యలపై వ్యాసం రాసి.. బయోడేటా వివరాలతో పాటు కలిపి పంపించాలని కోరింది. జూలై ఐదో తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.