సుమారు 40 ఏళ్లుగా హైదరాబాద్ నగర ప్రజలకు సేవలు అందించిన పాత మూసారాంబాగ్ వంతెన కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మూసీ నదికి వచ్చిన భారీ వరదల కారణంగా ఈ వంతెన ప్రమాదకరంగా మారినట్లు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. అంబర్పేట , దిల్సుఖ్నగర్లను కలిపే ఈ వారధి ఇక కనిపించదనే భావోద్వేగం స్థానికుల్లో వ్యక్తమైంది. పాత వంతెన స్థానంలో నూతన హై లెవల్ వంతెన నిర్మాణం వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.