Settipalli Land Issue: తిరుపతి శెట్టిపల్లెలో 45 ఏళ్లుగా నలుగుతున్న 380.42 ఎకరాల భూ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించింది. 2,111 మంది లబ్ధిదారులకు న్యాయం చేస్తూ, సంక్రాంతి రోజున లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో స్టాంపు డ్యూటీ మినహాయింపుతో ప్రభుత్వం రూ.16 కోట్ల భారాన్ని తగ్గించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ చొరవతో 45 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. దీనిపై శెట్టిపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.