ఓ వృద్ధురాలు 6 నెలలుగా జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రులు ఎన్ని తిరిగినా.. ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. చివరికి 6 నెలల తర్వాత కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా.. అసలు సమస్య బయటపడింది. ఆమె ఊపిరితిత్తుల్లో వక్క ఇరుక్కున్నట్లు.. స్కానింగ్ చేసిన డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆ వక్కను జాగ్రత్తగా బయటికి తీసి.. ఆమె మనోవేదనను తగ్గించారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.