Kuppam Farmers Land Problems Resolved: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పం రైతులకు సంబంధించిన 50 ఏళ్ల సమస్యను పరిష్కరించింది. గతంలో పట్టాలు పంపిణీ చేసినా అవి రద్దు కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం భూముల సమస్యను పరిష్కరించింది. అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు.. రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. తాజాగా కేబినెట్ సమావేశంలో చర్చించి పట్టాల పంపిణీకి ఆమోదం తెలిపారు.