తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 'దొరల గడీ' పాలనకు చరమగీతం పాడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ సభలో ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల్లోనే 70 లక్షల మంది రైతులకు రూ.9,000 కోట్లు అందించామని తెలిపారు. ఇందిరమ్మ పేరుతో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, మహిళలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.