ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో 100 పడకల ఆస్పత్రులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 50 పడకలకంటే తక్కువ ఉన్న ఆస్పత్రులు 61 నియోజకవర్గాలలో ఉన్నాయని మంత్రి వివరించారు. పీపీపీ మోడల్ కింద వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.