ఉపాధ్యాయ నియామకాల కోసం గతేడాది ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్పీపై వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులను అమ్ముకున్నారని, నిబంధనలను మార్చి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని జగన్ ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్లను మాజీ ముఖ్యమంత్రి టార్గెట్ చేసుకున్నారు.