హైదరాబాద్లో భారీగా జరిగిన ప్రభుత్వ ఆక్రమణలను విడిపించినట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించారు. ఏకంగా 923 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి రక్షించినట్లు తెలిపారు. వీటి విలువ ఏకంగా రూ.50 వేల కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఇక నగరంలో 60 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని.. వాటిలో 6 చెరువులకు పూర్తిగా పునరుజ్జీవనం కల్పించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే డీఆర్ఎఫ్ టీమ్లను భారీగా పెంచినట్లు వివరించారు.