ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయోధ్యనగర్ లోని క్షత్రియభవన్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. స్నేహితుడి హత్య కేసులో అరెస్టయి, ఇటీవల బెయిల్పై విడుదలైన నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఒక లేఖను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయన భార్య హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు.