పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఫోర్బ్స్ ఇండియా చేసిన ట్వీట్ను ఏపీ మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదే నిదర్శనమన్నారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదిత పెట్టుబడులలో 25.3 శాతం వాటాతో ఏపీ తొలిస్థానంలో ఉంది.