ఏపీ సర్కార్ అరకు కాఫీకి ప్రచారం కల్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే రేపు పార్లమెంట్ ఆవరణలో రెండు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. లోక్సభ స్పీకర్ ఆదేశాల మేరకు సోమవారం కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి లోక్సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.