ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు రాయితీతో సాగు పరికరాలు అందిస్తుందని ప్రకటించింది. ఆ జిల్లాకు 3.93 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. 1,782 పరికరాలను 20 మండలాల్లో పంపిణీ చేయనుంది. బ్యాటరీ స్ప్రేయర్లు, ట్రాక్టర్ అనుసంధాన నాగళ్లు, రొటావేటర్లు వంటి పరికరాలపై రాయితీ ఉంటుంది. మార్చి 31 దరఖాస్తులకు చివరి తేదీగా అధికారులు పేర్కొన్నారు.