ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం కానుంది. వంద మార్కుల పరీక్ష అయితే 12 గంటల 30 నిమిషాల వరకూ.. 50 మార్కుల పరీక్ష అయితే 11 గంటల 30 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.