Tirumala Free Darshan For 1000 Devotees: తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తులకుకొందరు దళారులు వరుసగా మోసగిస్తున్న ఘటనల్ని గుర్తు చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. దళారులు దర్శనం, వసతి పేరుతో సంప్రదిస్తే టీటీడీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఇటు వయోవృద్ధుల దర్శనాలకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ప్రతిరోజూ వెయ్యిమంది వయోవృద్ధులు, దివ్యాంగుల్ని దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపింది.