Telangana Free Laptops For Bc Gurukula Students: : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఎవరైనా విద్యార్థఉలు గురుకులాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయించారు.