TTD Food Water Lab Is Now Fully Operational In Tirumala: తిరుమల వచ్చే భక్తుల ఆరోగ్య రక్షణకు అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. తొలి అనాలిసిస్ రిపోర్ట్ను అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. రెండున్నర నెలల్లోనే రూ.25 కోట్లతో నిర్మించిన ఈ ల్యాబ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.