AP Govt Panchayat Raj MPDO Promotions: ఏపీ పంచాయతీరాజ్శాఖ గ్రామీణాభివృద్ధి శాఖలో అధికారుల కల నెరవేరింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లకు కీలక ముందడుగు పడింది. తాజాగా మరోసారి పదోన్నతుల సందడి మొదలైంది. 42 మంది ఎంపీడీవోలకు డీడీవోలుగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు సీనియారిటీ జాబితాను డీపీసీ ఆమోదించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎంపీడీవోలకు, ఇతర అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లు దక్కాయి.