ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటుగా ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్కు డిప్యూటీ తహశీల్దారుగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.