భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీసీఐకి పత్తి అమ్మాలనుకునే రైతులు 'కపాస్ కిసాన్' యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని మెలిక పెట్టింది. అందులో నిర్దేశించిన తేదీన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపింది. ఈ స్లాట్ బుకింగ్ విధానంపై చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.