ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కల్తీ మద్యం నియంత్రణ కోసం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ పేరుతో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక యాప్ తెచ్చింది. ఈ యాప్ సాయంతో మద్యం బాటిళ్లను స్కాన్ చేసి.. ఆ మద్యం ప్రామాణికతను తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు చెప్తున్నారు.