భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి రంగానికి ఒక ముఖ్యమైన ప్రోత్సాహకం లభించింది. సింగపూర్కు భారత ప్రీమియం బంగనపల్లె మామిడి పండ్ల మొదటి వాణిజ్య సముద్ర రవాణా విజయవంతమైంది. ఏపీలోని రైతులకు చెందిన తోటల నుంచి సేకరించి ఐదు టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను శుద్దిచేసి, సింగ్పూర్కు పంపారు. జూన్ 11న బయలుదేరిన నౌక.. 24న సింగ్పూర్ రేవుకు చేరుకుంది. ఇలా సముద్ర మార్గంలో తాజా ఉత్పత్తులను భారత్ సరఫరా చేయడం ఇదే మొదటిసారి.