ఫీజుల విషయంలో హైకోర్టులో విద్యార్థులకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం.. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫీజుల వసూళ్లు, రియంబర్స్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం.