ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్లను.. ఆ కుటుంబంలో మైనర్లయిన అనాథల పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. నిబంధనలు సడలించి పింఛన్లు మంజూరు చేసేందుకు సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.