ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు తిరిగి ప్రారంభించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఆందోళన విరమిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఎన్టీఆర్ వైద్యసేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు రూ.2700 కోట్లు బకాయిలు విడుదల చేయాలంటూ గత 20 రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మెకు దిగింది. దీంతో పలు ఆస్పత్రులలో ఓపీలు, అత్యవసర సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో సేవలను తిరిగి ప్రారంభించనున్నారు.