ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్త పింఛన్లు అందించనుంది. ఈ మేరకు ఏపీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి ఉత్తర్వులు విడుదల అయ్యాయి. లబ్ధిదారులకు జూన్ 12వ తేదీన పింఛన్లు అందించనున్నారు. జూన్ 12వ తేదీతో ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 71 వేల 380 మందికి స్పౌజ్ కేటగిరీ కింద నెలకు రూ.4000 చొప్పున పింఛన్లు అందించనున్నారు.