తెలంగాణ పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చార్మినార్, గోల్కొండ కోటల తరహాలోనే హైదరాబాద్లోని చంచల్గూడ జైలును కూడా అధికారిక పర్యాటక ప్రాంతంగా గుర్తించింది. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు.. ఇక్కడ ఇటీవల ప్రారంభించిన ఫీల్ ది జైల్ అనుభూతిని అధికారిక టూరిజం ఆఫరింగ్గా ప్రమోట్ చేయనున్నారు. 24 గంటల జైలు అనుభూతి కోసం రూ. 2 వేలుగా టికెట్ రుసుం నిర్ణయించగా.. త్వరలో ఆన్లైన్ టికెటింగ్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించనున్నారు.