టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న 'మహాజన్ సంపర్క్ అభియాన్'లో భాగంగా ఈ సమావేశం జరిగింది. మోదీ ప్రభుత్వ విజయాల బ్రోచర్లను చిరుకు అందజేశారు. అయితే, ఈ భేటీతో చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా? అనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకున్నాయి.